: ఏయూను ప్రపంచస్థాయి యూనివర్శిటీగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ)ని ప్రపంచస్థాయి యూనివర్శిటీగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణంలోని ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ అలుమ్ని అసోసియేషన్ వెబ్ సైట్ ను చంద్రబాబుతో పాటు జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఏయూ అలుమ్నికి ప్రభుత్వం తరపున రూ.10 కోట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. యూనివర్శిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను అలవర్చుకోవాలని, డిజిటల్ ఎకానమీలో విశాఖపట్టణం టాప్ ప్లేస్ లో నిలవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.