: ఎంసీఏ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పిన శరద్ పవార్

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించి జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ, దాని అనుబంధ యూనిట్లలోని అధికారులు, బాధ్యులకు వయసు, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు  కనుక అమలైతే ఎంసీఏ అధ్యక్ష పదవిలో ఉన్న ఆయనపై వేటు పడేది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా, రాజకీయాలతో పాటు బీసీసీఐ, దాని అనుబంధ  యూనిట్లలో శరద్ పవార్ కొనసాగుతున్నారు. 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 2010-12 వరకు ఐసీసీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2015లో ఎంసీఏ అధ్యక్షుడిగా పవార్ మూడోసారి ఎన్నికయ్యారు.  

More Telugu News