demonitization: ఫైనాన్షియర్ కిశోర్ భజియావాలా ఇంట్లో రూ.400 కోట్ల నగదు, బంగారం ప‌ట్టివేత

పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచి సోదాలు జరుపుతున్న అధికారులకు భారీ మొత్తంలో నల్లధనం, బంగారం పట్టుబడుతున్నాయి. అధికారులే ఆశ్చ‌ర్య‌పోయేలా కోట్ల రూపాయల నల్లధనం బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం సూర‌త్‌లో త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు మ‌రో భారీ అవినీతి చేప‌ను ప‌ట్టుకున్నారు. ఫైనాన్షియ‌ర్ కిశోర్ భ‌జియావాలాకు చెందిన ఆస్తులపై దాడులు నిర్వ‌హించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అత‌డి వ‌ద్ద నుంచి ఏకంగా 400 కోట్ల రూపాయల విలువ‌చేసే న‌గ‌దు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయ‌న వ‌ద్ద నుంచి ప‌లు ప‌త్రాలు కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News