demonitization: నోట్ల మార్పిడికి పాల్పడ్డ మరో ఇద్దరు ఆర్‌బీఐ అధికారుల అరెస్టు

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాలని సూచించాల్సిన ఆర్‌బీఐ అధికారులే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ పోలీసుల‌కి ప‌ట్టుబ‌డుతున్నారు. నోట్ల మార్పిడి కేసులో నాలుగు రోజుల క్రితం బెంగ‌ళూరులో ఆర్‌బీఐ అధికారి మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా అదే బెంగళూరులో మ‌రో ఇద్ద‌రు ఆర్‌బీఐ అధికారులు అరెస్ట‌య్యారు. వారిలో ఒక‌రు ఆర్‌బీఐలో సీనియ‌ర్ స్పెష‌ల్ అసిస్టెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న వ్య‌క్తి కాగా, మ‌రొక‌రు స్పెష‌ల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్‌మెంటుగా ప‌నిచేస్తున్నారు. వీరిరువురు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నోట్ల మార్పిడిని ప్రోత్స‌హిస్తూ ప‌లు అక్రమాలకు పాల్ప‌డ్డారని సంబంధిత అధికారులు తెలిపారు.

More Telugu News