terror atteck: మరోసారి రెచ్చిపోయి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు జ‌వాన్లు

జమ్ముకశ్మీర్‌లో పుల్వామా జిల్లా పాంపోర్‌లోకి ప్ర‌వేశించిన‌ ఉగ్ర‌వాదులు అక్క‌డ నుంచి వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు సంబంధిత అధికారులు ప్ర‌క‌టించారు. అక్క‌డ జ‌న‌స‌మూహం కూడా ఉండ‌డంతో ఎదురుకాల్పుల‌కు దిగ‌డానికి జ‌వాన్లు ఆలోచించార‌ని, దీంతో అక్క‌డి నుంచి ఉగ్ర‌వాదులు పారిపోయార‌ని అన్నారు. ఉగ్ర‌వాదుల‌ కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించాయని చెప్పారు. 

More Telugu News