cricket: చెన్నయ్ టెస్టు: రెండోరోజు ముగిసిన ఆట.. భారత్ స్కోరు 60

చెన్న‌య్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న చివ‌రిటెస్టు మ్యాచులో మొద‌టి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన‌ టీమిండియా ఈ రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి వికెట్ నష్ట‌పోకుండా 60 ప‌రుగులు చేసింది. క్రీజులో 30 ప‌రుగుల‌తో రాహుల్, 28 ప‌రుగుల‌తో పార్థివ్ ఉన్నారు. ఇంగ్లండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 477 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 10, జెన్నింగ్స్ 1, రూట్ 88, మొయిన్ అలీ 146, బెయిర్ స్టో 49, స్టోక్స్ 6, బ‌ట్ల‌ర్ 5, డావ్‌స‌న్ 66 (నాటౌట్‌), ర‌షీద్ 60, బ్రాడ్ 19, బాల్ 12 ప‌రుగులు చేశారు.

More Telugu News