: అభివృద్ధికి వారసుడు చంద్రబాబు..అవినీతికి వారసుడు జగన్: యరపతినేని

అభివృద్ధికి వారసుడు చంద్రబాబు..అవినీతికి వారసుడు జగన్ అని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, సరస్వతి భూముల విషయంలో రైతులపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలు, రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. చెన్నాయపాలెం రైతులకు క్షమాపణ చెప్పాకే గురజాల నియోజకవర్గం గురించి జగన్ మాట్లాడాలని యరపతినేని అన్నారు. కాగా,  నిన్న నరసరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేశ్ రెడ్డి  ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని అవినీతికి పాల్పడుతున్నారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యరపతినేని స్పందిస్తూ జగన్ పై మండిపడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.

More Telugu News