cricket: చెన్నయ్ టెస్టు: ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

చెన్న‌య్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచులో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జ‌ట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్‌ అలీ సెంచ‌రీతో రాణించ‌డంతో నిన్న‌ ఆ జ‌ట్టు నాలుగు వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు 120 ప‌రుగుల వ్యక్తిగత స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన మొయిన్ అలీ 146 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌య్యాడు.

అనంత‌రం ఈ రోజు ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన స్టోక్స్ 6 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద అవుట‌య్యాడు. త‌దుప‌రి క్రీజులోకి వ‌చ్చిన బ‌ట్ల‌ర్ 5 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో డాస‌న్‌(21), ర‌షీద్ (8) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయ‌గా, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఉమేష్‌, అశ్విన్‌ల‌కు చెరో వికెట్ ద‌క్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 346/7 (116 ఓవర్లకి)గా ఉంది.

More Telugu News