cricket: చెన్నయ్ టెస్టు: మొదటిరోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు 284 పరుగులు

భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య‌ చెన్న‌య్ లో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డేలో తొలిరోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్‌ అలీ సెంచ‌రీతో రాణించ‌డంతో ఆ జ‌ట్టు తొలిరోజు 284 ప‌రుగులు చేయగ‌లిగింది. క్రీజులో 120 ప‌రుగుల వ్యక్తిగత స్కోరుతో మొయిన్ అలీ, 5 ప‌రుగుల‌తో స్టోక్స్ ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయ‌గా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. మిగ‌తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 10, జెన్నింగ్స్ 1, రూట్ 88, బెయిర్‌స్టో 49 ప‌రుగులు చేశారు. ఇక ఎక్స్‌ట్రాల రూపంలో ఇంగ్లండ్ జ‌ట్టుకి 11 ప‌రుగులు ల‌భిచ‌డంతో తొలిరోజు ఆటలో మొత్తం 90 ఓవర్లకి ఇంగ్లండ్ స్కోరు 284గా ఉంది.

More Telugu News