tv actress war: పారితోషికం చిచ్చు: కవిత, శ్రీవాణిల టీవీ షో రగడ!

బుల్లితెర నటి శ్రీవాణి, సినీ నటి, టీడీపీ నేత కవిత మధ్య విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందని ఇద్దరినీ ప్రశ్నించగా, ఒకే అంశంపై ఇద్దరూ వేర్వేరు వాదనలు వినిపిస్తున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే... శ్రీవాణి భర్త జెమినీ టీవీలో 'కెవ్వు కబడ్డీ' అనే టీవీ షోను నిర్వహిస్తున్నాడు. ఈ షోలో సుమారు 60 మంది టీవీ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ షోకు కవిత న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఆమెకు రోజుకు 25 వేల పారితోషికం మాట్లాడుకున్నామని కవిత చెబుతున్నారు. దానికి సంబంధించి 75 వేలు ఇచ్చిన శ్రీవాణి, మిగిలిన మొత్తానికి చెక్కు ఇచ్చారని, దానిని మార్చుకునేందుకు వెళ్లగా స్టాప్ పే మెంట్ పెట్టారని ఆరోపించారు.

దీనికి శ్రీవాణి వివరణ ఇస్తూ, ఈ షోలో పాల్గొంటున్న వారెవరింటికీ తాను వెళ్లలేదని, కవితపై అభిమానంతో ఆమె ఇంటికి వెళ్లి షోలో పాల్గొనాలని కోరానని తెలిపింది. ఆమె దానికి అంగీకరించిందని, దీంతో ఆమె ఫ్రీగా నటిస్తుందని భావించానని చెబుతోంది. సీనియర్ నటులు చాలా కార్యక్రమాల్లో ఫీగా నటిస్తారని చెబుతోంది. తాను కూడా అలాగే అనుకున్నానని, కానీ ఆమె రెమ్యూనరేషన్ అడిగారని చెబుతోంది. అలాగే ప్రోమో కోసం చీర తీసుకుని వస్తే తాను డబ్బులు ఇస్తానని అన్నారని, తరువాత చీరతో తనకు సంబంధం లేదని చెబుతున్నారని చెప్పింది. అలాగే మేకప్ కోసం కూడా ఆమె రోజుకో డిమాండ్ చేశారని శ్రీవాణి ఆరోపిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ఇంకా సద్దుమణగకపోవడం విశేషం.

More Telugu News