: డబ్బు విత్ డ్రా పరిమితికి త్వరలోనే ముగింపు

నగదును విత్ డ్రా చేసుకోవడానికి ఉన్న పరిమితిని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. 80 శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే నిబంధనలను సడలిస్తారని సమాచారం. ఇప్పటికే బ్యాంకుల్లో 50 శాతం కొత్త కరెన్సీనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విత్ డ్రా పరిమితిని సడలిస్తే... జనాలకు ఉపశమనం లభించినట్టే. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ... విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేక, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 

More Telugu News