: రూ. 1.36 లక్షల ఖరీదైన బైక్ ను విడుదల చేసిన బజాజ్

అత్యంత ఖరీదైన డొమినర్ 400 బైక్ ను ఆటొమొబైల్ దిగ్గజం బజాజ్ ఈ రోజు విడుదల చేసింది. బజాజ్ డొమినర్ 400 నాన్ ఏబీఎస్ ధర రూ. 1.36 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). డొమినర్ 400 ఏబీఎస్ ధర రూ. 1.50 లక్షలు.  ఈ సందర్భంగా బజాజ్ ఆటో బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ మాట్లాడుతూ, పెద్ద బైక్ ల విభాగంలో ఇది ప్రారంభమేనని చెప్పారు.

బజాజ్ డొమినర్ 400 ప్రత్యేకతలు:

  • 373 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4-వాల్వ్ ఇంజిన్
  • 6 స్పీడ్ గేర్ బాక్స్
  • స్లిప్పర్ క్లచ్
  • 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
  • అడ్జస్టబుల్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్
  • 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 230 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్
  • ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్
  • మిడ్ నైట్ బ్లూ, ల్విలైట్ ప్లమ్, మూన్ వైట్ రంగుల్లో లభ్యం

More Telugu News