: ఆసుపత్రి నుంచి నటుడు దిలీప్ కుమార్ డిశ్చార్జ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఎడమకాలికి తీవ్రమైన నొప్పి, వాపు రావడంతో వారం రోజుల క్రితం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన చేరారు. చికిత్స అందించిన అనంతరం కాలి నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, కాలినొప్పితో పాటు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు వైద్య చికిత్స అనంతరం ఉపశమనం లభించిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, దిలీప్ కుమార్ ని ఆసుపత్రిలో చేర్పించిన వార్త తెలియగానే, ఆయన అభిమానులు ఆదుర్దా పడిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన పనిలేదని దిలీప్ కుమార్ ఇటీవల ఒక ట్వీట్ చేయడంతో అభిమానులు స్థిమితపడ్డారు.
 

More Telugu News