bank looty: బ్యాంకులోకి చొరబడి 11 ల‌క్ష‌ల రూపాయ‌లు చోరీ చేసిన‌ ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు క‌ల‌క‌లం రేగింది.  ఓ బ్యాంకులోకి ప్ర‌వేశించిన‌ ఉగ్రవాదులు దోపిడీ చేసి పారిపోయారు. పుల్వామా జిల్లాలోని జ‌మ్ముక‌శ్మీర్ బ్యాంక్‌ రాట్నిపారా బ్రాంచిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఉగ్ర‌వాదులు బ్యాంకులో మొత్తం 11 ల‌క్ష‌ల రూపాయ‌లు చోరీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. స‌ద‌రు బ్యాంకు వ‌ద్ద‌కు చేరుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, సంబంధిత అధికారులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టి, ఆధారాలు సేక‌రిస్తున్నారు. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.

More Telugu News