parliament: లోక్‌స‌భ రేప‌టికి వాయిదా.. ప్రారంభ‌మైన రెండు నిమిషాల‌కే మ‌ళ్లీ వాయిదా ప‌డిన రాజ్య‌స‌భ‌

వాయిదా అనంతరం ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభమైన పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో మ‌ళ్లీ గంద‌ర‌గోళం నెల‌కొంది. పెద్దనోట్ల ర‌ద్దుపై చ‌ర్చించాల్సిందేనంటూ రాజ్య‌స‌భ‌లో పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డంతో రాజ్య‌స‌భ ప్రారంభ‌మైన రెండు నిమిషాల‌కే ఛైర్మ‌న్ హ‌మీద్ అన్సారీ స‌భ‌ను 30 నిమిషాలు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు లోక్‌స‌భ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొన‌డంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

More Telugu News