: మా హోటళ్లపై వస్తున్న వదంతులు నమ్మకండి: 'షా గౌస్' హోటల్ యజమాని రబ్బానీ

హైదరాబాద్ లో ఉన్న తమ హోటళ్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని 'షా గౌస్' హోటల్ యజమాని రబ్బానీ కోరారు. ఈ మేరకు ఒక న్యూస్ ఛానెల్ ద్వారా ఒక ప్రకటన చేేశారు. తమ హోటళ్లలో బిర్యానీ తయారీలో ఎక్కడా రాజీ పడటంలేదని, వినియోగదారులందరూ తమపై నమ్మకం ఉంచాలని ఈ సందర్భంగా కోరారు. తమ హోటళ్లకు మంచి పేరుందని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వారు, సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు సృష్టిస్తున్నారని రబ్బానీ ఆరోపించారు. 

More Telugu News