demonitization: బ్యాంకుల ముందు తప్పని తిప్పలు.. ఎస్‌బీఐ వద్ద తోపులాట.. ఇద్దరు మహిళలకు గాయాలు

పెద్ద‌నోట్ల ర‌ద్దు తరువాత న‌గ‌దు కొరత కార‌ణంగా ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుక్కోవ‌డానికి కూడా డ‌బ్బు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున బ్యాంకులకు వెళ్లి క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు బ్యాంకుల ముందు ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట ఎస్‌బీఐలో ఈ రోజు క్యూలో నిల‌బ‌డిన‌ ఖాతాదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు మహిళలు గాయాల‌పాల‌య్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ‌బ్బు కోసం ఖాతాదారులు ఒక్కసారిగా బ్యాంకులోకి దూసుకు వెళ్ల‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. తోపులాట జ‌ర‌గ‌డంతో ఆ బ్యాంకులో కాసేపు లావాదేవీలు ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి.

More Telugu News