: రైలు కింద‌ప‌డి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. కుమారుడి మృతిని త‌ట్టుకోలేక తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ మండ‌లం ఇండ్ల‌చెరువులో ఈ రోజు ఉద‌యం విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని 15 ఏళ్ల ఓ ప‌దో త‌ర‌గతి విద్యార్థి ఈ రోజు ఉద‌యం రైలుకింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ వార్త‌ను తెలుసుకున్న ఆ విద్యార్థి తండ్రి కుమారుడి మృతి ప‌ట్ల తీవ్ర‌ మ‌న‌స్తాపం చెంది ఇండ్ల‌చెరువులో రైలుకింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల గురించి స‌మాచారం అందాల్సి ఉంది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News