nissan gt-r: భారత్ లో జాన్ అబ్రహాం దగ్గర మాత్రమే ఈ కారుంది!

జపాన్ కార్ల కంపెనీ నిస్సాన్ తాజా మోడల్ స్పోర్ట్స్ కారు 'జీటీ-ఆర్' భారత్ మొత్తానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం ఒక్కడి దగ్గర మాత్రమే  ఉండడం విశేషం. ఈ కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా జాన్ అబ్రహాం వ్యవహరిస్తున్నాడు. ఈ కారు ఈ మధ్యే దేశీయ విపణిలోకి విడుదలైంది. దీని ధర 1.99 కోట్ల రూపాయలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). 3.8 లీటర్ వీ6 24 వాల్వ్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగిన అధునాతన డిజైన్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ కారును తయారు చేయడం విశేషం. ఈ కారును కొనుగోలు చేసిన రోజే జాన్ కు డెలివరీ ఇవ్వడం విశేషం.

More Telugu News