chandrababu: వేగం పెంచాలి.. రాజీప‌డితే స‌హించేది లేదు: అధికారుల‌తో చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు సంబంధిత అధికారులతో స‌మీక్ష‌ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... ప్రాజెక్టు ప‌నుల్లో మ‌రింత‌ వేగం పెంచాలని, రాజీప‌డితే స‌హించేది లేదని అధికారుల‌తో అన్నారు. పెండింగ్ ప‌నులను వెంట‌నే పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అలాగే మ‌ట్టి త‌వ్వ‌కం ప‌నుల్లోనూ వేగం పెంచాల‌ని సూచించారు. ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన ప‌లు ప‌నుల‌పై అధికారులు సీఎంకి వివ‌రించారు.

More Telugu News