biryani: 20 నిమిషాల్లో మా నూడుల్స్ తినండి.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పట్టుకెళ్లండి: ఓ రెస్టారెంట్ భారీ ఆఫర్!

జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్ నిర్వాహ‌కులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కి ఓ వినూత్నమైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తమ రెస్టారెంట్‌లో ప్ర‌త్యేకంగా తయారుచేసిన‌ చికెన్‌ నూడుల్స్‌ను తాము నిర్దేశించిన పరిమిత స‌మయంలో తినేసి, తామిచ్చే గిఫ్ట్‌ను ప‌ట్టుకెళ్ల‌మ‌ని ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఉమకర రామెన్‌ హైవురి రెస్టారెంట్‌లో ఈ పోటీని మూడేళ్లుగా నిర్వ‌హిస్తున్నారు. ఈ పోటీకి దిగుతామ‌ని వ‌చ్చిన‌వారికి 4 కిలోల చిక్కుడు మొలకలు, మసాలా, సూప్‌తో కలిపి ఫ్రై చేసిన ఒక కోడితో తయారు చేసిన చికెన్‌ నూడుల్స్‌ను ఇస్తున్నారు. వాటిని కేవ‌లం 20 నిమిషాల్లో తినేస్తే బహుమతిగా 438 డాలర్లు ఇచ్చేస్తున్నారు. ఈ నూడుల్స్‌ని 20 నిమిషాల్లో తిని విజేతగా నిలిచిన వారు బిల్లు కూడా కట్టే అవ‌స‌రం ఉండ‌దు.

ఒకవేళ తిన‌లేక వ‌దిలేస్తే మాత్రం  88 డాలర్లు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పోటీకి దిగిన వారు నెగ్గ‌డానికి ఓ స‌దుపాయం కూడా ఇస్తున్నారు. ఒక‌వేళ 20 నిమిషాల్లో నూడుల్స్‌ను తిన‌లేపోతే పోటీకి దిగిన వ్య‌క్తికి మరో 10 నిమిషాలు సమయం ఇస్తారు. అయితే, మ‌రో ప‌దినిమిషాలు స‌మ‌యం తీసుకున్న వారు ఒకవేళ గెలిస్తే 438 డాల‌ర్లు కాకుండా 236 డాలర్లను బ‌హుమ‌తిగా ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనాల‌నుకునే వారు ముందుగా 26 డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీ గత మూడేళ్లగా నిర్వహిస్తున్నప్ప‌టికీ  ఇప్పటివరకు గెలిచిన‌వారి సంఖ్య  9 మాత్రమేన‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

More Telugu News