: జయలలిత ఆత్మ సమాధివద్ద తిరుగుతోందా?...తమిళనాట వార్తలు హల్ చల్

తమిళనాట ‘అమ్మ’గా నీరాజనాలు అందుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో తమిళులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో ఆమెను ఖననం చేసిన మెరీనా బీచ్ యాత్రా స్థలంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందంటూ తమిళ వెబ్‌ సైట్లు కథనాలతో హోరెత్తించాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం అమ్మ ఆత్మ వార్తలతో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆత్మ కూడా ‘అమ్మ’ ఆకారాన్ని పోలి ఉందని, తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ పలు వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక ఫోటో కూడా జత చేశారు. దీంతో ఈ వార్త తమిళనాట వైరల్ అయ్యింది. దీంతో మరిన్ని కథనాలు ఆమె ఆత్మచుట్టూ అల్లుకుంటున్నాయి. అమ్మకు ప్రధాని కావాలనే కోరిక బలంగా ఉండేదని, ఆ కోరిక తీరకపోవడంతో ఆమె ఆత్మగా మారి, సమాధి వద్దకు వచ్చి ఉంటుందని దేవుళ్లను, ఆత్మలను నమ్మేవారు కొత్త వాదన వినిపిస్తున్నారు. అయితే, వీటిని పలువురు కొట్టి పారేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇవేం నమ్మకాలు అంటూ తీసిపారేస్తున్నారు. ఈ ఫోటో కూడా ఫొటోషాప్ మాయాజాలమని పేర్కొంటున్నారు. 

More Telugu News