airports: చెన్నై, తిరుపతి విమానాలు రద్దు... దారి మళ్లింపు

వార్థా తుపాను బీభత్సానికి రవాణా మార్గాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికే చెన్నై వెళ్లాల్సిన 17 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, చెన్నైకి వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జలరవాణాకు అవకాశం లేదు. ఈదురు గాలులు, భారీగా కురుస్తున్న వర్షం ధాటికి విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. చెన్నై, తిరుపతి వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లించినట్టు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ విమానాలను హైదరాబాదులో ల్యాండ్ చేయనున్నారు. తదుపరి అప్ డేట్ ను తమ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తామని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. 

More Telugu News