: ఇప్పటికీ నాకు మొబైల్ ఫోన్ వాడటం తెలియదు: మాజీ ప్రధాని దేవెగౌడ

‘నేను ఒక మాజీ ప్రధానిని..ఇప్పటికీ నాకు ఫోన్ వాడటం తెలియదు’ అని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై మండిపడ్డ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరినీ మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని మోదీ చెబుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నిరక్షరాస్యులే ఉంటారని..  ఏ విధంగా మొబైల్ ఫోన్లు వాడాలో ఇప్పటికీ తెలియని వారు చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, స్మార్ట్ ఫోన్ బ్యాంకింగ్ అంటూ ఉపన్యాసాలు చెప్పడం సబబు కాదని, ఒక నియంతలా మోదీ వ్యవహరిస్తున్నారని దేవెగౌడ విమర్శించారు.


More Telugu News