cricket: డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ...ఆ తరువాత ఏం చేశాడో తెలుసా?

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. డబుల్ సెంచరీ చేసే క్రమంలో సుమారు 6 గంటలపాటు కోహ్లీ క్రీజులో గడిపాడు. అంతసేపు ఆడిన కోహ్లీ మ్యాచ్ ముగిసిన తరువాత విశ్రాంతి తీసుకుని ఉంటాడని ఊహిస్తే మీరు తప్పులో కాలేసినట్టే. అంతసేపు ఆడినప్పటికీ కోహ్లీ మళ్లీ ఫిట్ నెస్ కోసం జిమ్ లో చెమటలు కక్కాడని దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అంత అంకితభావం ఉంది కనుకే కోహ్లీ రన్ మెషీన్ గా పేరుతెచ్చుకున్నాడని గంగూలీ కితాబునిచ్చాడు. అతని స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తాడని గంగూలీ తెలిపాడు. అలా కాకుండా కోహ్లీ ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్నాడు కనుకే...అద్భుతమైన ఫిట్ నెస్ తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడని పేర్కొన్నాడు. 

More Telugu News