india: పొరుగు దేశం తీరు మారలేదు.. భారత్ కు మద్దతు ఇవ్వనని చెప్పిన చైనా!

భారత్ విషయంలో చైనా త‌న‌ తీరుని మార్చుకోవ‌డం లేదు. న్యూక్లియ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లో స‌భ్య‌త్వం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న భార‌త్ ప‌ట్ల త‌మ మొండి వైఖ‌రిని మ‌రోసారి వెళ్ల‌గ‌క్కింది. ఎన్ఎస్జీతో పాటు ఉగ్రవాది మ‌సూద్ అజ‌ర్ ను ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఉగ్ర‌వాదిగా గుర్తించాల‌నే అంశంపై త‌మ విధానంలో మార్పులేదని, తమ మద్దతు ఉండబోదని ఈ రోజు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ రెండు అంశాల్లో భార‌త్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని చైనా విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది.  దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి! 

More Telugu News