భార్య హత్య: భార్యను చంపి ఆమె శవంపైనే మూడు గంటల పాటు కూర్చున్న కిరాతకుడు!

కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న వాగ్వాదంతో భార్యను హత్య చేసిన దారుణం నిన్న ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, జోగేశ్వరి ప్రాంతంలో డెంటల్ క్లినిక్ నడిపే డెంటిస్ట్ బబోల్ మాతుంగలోని కోహినూర్ టవర్స్ లో భార్య తనూజ పిల్లలతో పాటు నివాసముంటున్నాడు. నిన్న భార్య తనూజతో ఘర్షణపడ్డాడు. ఇది పెరిగిపెద్దది కావడంతో కత్తితో తనూజను పొడిచి హత్య చేశాడు. అనంతరం మూడు గంటలపాటు ఆమె శవంపైనే కూర్చున్నాడు. ఉదయం 9:30 గంటలకు విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేవరకు బబోల్ అలాగే ఉండడం విశేషం. 

More Telugu News