: చెన్నయ్‌ తీరాన్ని తాకి విరుచుకుప‌డుతున్న‌ ‘వార్దా’ అతితీవ్ర తుపాను.. విరిగిపడుతున్న చెట్లు

తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉన్న 'వార్దా' అతితీవ్ర‌ తుపాను వేగంగా దూసుకొచ్చి చెన్నయ్‌ తీరాన్ని తాకింది.  గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.  దీంతో తమిళనాడు ప్రభుత్వం మ‌రింత‌ అప్రమత్తమైంది.  త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం అధికారుల‌తో భేటీ అయి ప‌లు సూచ‌న‌లు చేశారు. చెన్నయ్ తీరాన్ని తాకిన వార్దా ఆ న‌గ‌రంపై విరుచుకుపడుతోంది. చెన్నయి-గూడూరు మ‌ధ్య రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌ట్టాల‌పై, ర‌హ‌దారుల‌పై చెట్లు విరిగిప‌డుతున్నాయి. దీంతో ప‌లు మార్గాల్లో రైళ్లు, వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, చెట్లు, స్తంభాల వద్ద నించోకూడదని తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది.  



More Telugu News