: నానక్ రాంగూడ ఘటన.. భవన యజమాని, కొడుకు అరెస్టు

హైదరాబాద్ లోని నానక్ రాంగూడ లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిన సంఘటన కేసులో ఆ భవన యజమాని సత్తూసింగ్, కొడుకు అనిల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1గా సత్తూసింగ్, ఏ-2గా అనిల్ సింగ్, ఏ-3గా కాంట్రాక్టర్, ఏ-4గా బిల్డింగ్ ప్లానర్ ను చేరుస్తూ ఐపీసీ 304 (2), 304ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

More Telugu News