: నటి గౌతమి రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చిన శరత్ కుమార్

జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సినీనటి గౌతమి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో మరో నటుడు శరత్ కుమార్ కూడా మోదీకి లేఖ రాశారు. అయితే, తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఈ లేఖను రాశారు. ఈ లేఖలో గౌతమి గురించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది అర్థంలేని ఆరోపణలు చేస్తూ, ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని శరత్ కుమార్ అన్నారు. జయలలిత విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించిందని, సాధ్యమైనంత చొరవ చూపిందని ప్రశంసించారు. ప్రధాని విధానాలను, విలువలను కొందరు అర్థం చేసుకోలేరని అన్నారు.

More Telugu News