: కాపీ ట్వీట్ పై క్షమించమని కోరిన మంచు లక్ష్మి

మంచువారి అమ్మాయి, నటి, నిర్మాత మంచు లక్ష్మి చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. "పోయిన నెల ఇదే రోజున క్యాస్ట్రో బతికి ఉన్నారు. అమ్మ కోలుకుంటున్నారు. తొలి మహిళా అధ్యక్షురాలి కోసం అమెరికా ఎదురుచూస్తోంది. మీ దగ్గర డబ్బు కూడా ఉంది", ఇది లక్ష్మి చేసిన ట్వీట్. 8వ తేదీన లక్ష్మి ఈ ట్వీట్ చేసింది. అయితే, తాను చేసిన ట్వీట్ ను లక్ష్మి కాపీ చేసిందంటూ లక్ష్మిని ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీంతో, తన ఫ్రెండ్ ద్వారా వచ్చిన మెసేజ్ లో పేరు లేకపోవడంతో... అసలైన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని, తనను క్షమించాలని కోరింది. మంచి ట్వీట్ చేశారంటూ సదరు వ్యక్తిని అభినందించింది.

More Telugu News