: చంద్రబాబు ఆదేశాలతో శేఖర్ రెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను అధికారులకు చిక్కిన అతిపెద్ద అక్రమార్జన చేప శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా తొలగిస్తూ, ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పేరిట జారీ అయిన ఆదేశాల్లో, తన విశేషాధికారాలతో శేఖర్ రెడ్డిని తక్షణం బోర్డు సభ్యుడి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. తొలగింపునకు కారణాలను ఈ ఆదేశాల్లో వెల్లడించలేదు. కాగా, ఆయన వద్ద వందల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ, భారీ ఎత్తున బంగారం లభ్యమైన సంగతి తెలిసిందే. కాగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే దేవాదాయ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News