: ఏపీ గ్రూప్-2 దరఖాస్తు గడువు పెంపు

ఏపీ గ్రూప్-2 దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తుల గడువు మరోమారు పొడిగించడమనేది ఉండదని ఆ ప్రకటనలో ఉదయభాస్కర్ స్పష్టం చేశారు.

More Telugu News