: తుపాన్ ఎఫెక్ట్... అండమాన్ లో చిక్కుకున్న 1400 మంది టూరిస్టులు

అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 1400 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అండమాన్ లోని హావెలాక్ మరియు నీల్ దీవుల్లో వీరు ఇరుక్కుపోయారు. వార్దా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు దిక్కుతోచని స్థితిలో వున్నారు. ఈ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, టూరిస్టులంతా క్షేమంగానే ఉన్నారని... వారి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తుపాను ప్రభావం కొంచెం తగ్గిన వెంటనే... ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలను తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే పోర్ట్ బ్లెయిర్ లో రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News