: టీమిండియా జట్టులో అందరూ సెంచరీ వీరులే!

చెప్పాలంటే ఇది కూడా ఓ అద్భుతమైన రికార్డే. ఇంగ్లండ్ తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లంతా సెంచరీ వీరులే. బ్యాట్స్ మెన్లు, బౌలర్లు, వికెట్ కీపర్ అందరూ శతకాలు బాదిన వాళ్లే. తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ కెరియర్లో కనీసం ఒక సెంచరీ అయినా చేశారు. ఈ మ్యాచ్ లో మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, కేకే నాయర్, అశ్విన్, పార్థివ్ పటేల్, జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆడుతున్నారు. 1992-93లో జింబాబ్వేతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కూడా... ఇదే విధంగా తుది జట్టులో అందరూ సెంచరీ వీరులే ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తొమ్మిదిసార్లు జరిగింది.

More Telugu News