: రైల్వే జోన్ సురేష్ ప్రభు చేతిలో లేదు: సుజనా చౌదరి

రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చలు సానుకూలంగా ముగిశాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఢిల్లీలో రైల్వే మంత్రితో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ అంశంపై స్పష్టత రాలేదని అన్నారు. జోన్ ప్రకటనలో వివిధ సమస్యలున్నాయని ఆయన చెప్పారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపేయడంతో రైల్వే జోన్ ప్రకటన సురేష్ ప్రభు చేతుల్లో లేదని ఆయన చెప్పారు. ఇతర సమస్యలపై ఆయనతో చర్చించామని, వాటికి ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

More Telugu News