: మంచు కౌగిలిలో ఢిల్లీ.. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం.. పలు సర్వీసులు రద్దు

గతంలో ఎన్నడూ లేనంతగా దేశ రాజధాని ఢిల్లీ మంచు కౌగిట్లో ఒదిగిపోయింది. నగరాన్ని పొగమంచు దుప్పటిలా చుట్టేసింది. ఉదయం 8 గంటలు అవుతున్నా సూర్యుడి జాడలేదు. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పొగమంచు ప్రభావంతో పలు అంతర్జాతీయ విమానాలతోపాటు రైళ్ల సర్వీసులు కూడా రద్దయ్యాయి. 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మూడు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 5 దేశీయ విమాన సర్వీసులు, 8 అంతర్జాతీయ విమాన సర్వీసులను విమానయాన సంస్థ అధికారులు రద్దు చేశారు. మూడు అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. పరిస్థితి అనుకూలించకుంటే మరిన్ని సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

More Telugu News