: అత్యాచారాలపై మహిళలు మౌనం వీడాలి: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గళం విప్పారు. తమపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, ఇతర హింసలపై మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్యాయాన్ని బయటకు చెప్పినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. చదువుకున్న మహిళలు సైతం కొన్నిసార్లు సామాజిక కట్టుబాట్ల కారణంగా మౌనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించడంలో సమాజం విఫలమైందన్నారు. ఇప్పటికైనా మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, తాము అబలలం కాదని నిరూపించాలని కత్రినా కైఫ్ పిలుపునిచ్చారు.

More Telugu News