: చెన్నై టెస్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు... ప్రజల మూడ్ బట్టి నిర్ణయం తీసుకుంటాం: షిర్కే

జ‌య‌ల‌లిత మృతితో చెన్నైలో జ‌ర‌గాల్సిన ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. జయలలిత మరణంతో తీవ్ర వేదనలో కూరుకుపోయిన తమిళ ప్రజలు ఆ బాధ నుంచి త్వరగా కోలుకుంటారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా, ఇంగ్లిష్ జట్ల మధ్య నిర్వహించాల్సిన మ్యాచ్ ఇక్క‌డే నిర్వ‌హించడం కుదురుతుందా? లేక వేదిక‌ను మార్చాలా? అన్న‌దానిపై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని, మరికొంత సమయం వేచి చూడాల‌ని బీసీసీఐ భావిస్తోందని బీసీసీఐ కార్య‌ద‌ర్శి అజ‌య్ షిర్కే తెలిపారు. కాగా, డిసెంబ‌ర్ 16 నుంచి 20 వ‌ర‌కు ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్ చెన్నైలో జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జ‌య‌ల‌లిత మృతి చెందడంతో పరిణామాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఐదో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు, విశ్లేషణల్లో టెస్టు నిర్వహించడం సాహసమే అవుతుందని పలువురు పేర్కొంటుండడంతో తదుపరి చర్యలపై బీసీసీఐ పరిశీలిస్తోందని, పరిస్థితులను సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News