: అమ్మకు నివాళులర్పించిన ప్రణబ్ ముఖర్జీ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాళులర్పించారు. రాజాజీ హాల్ కు చేరుకున్న రాష్ట్రపతి పుష్పగుచ్ఛంతో ఆమెకు నివాళులర్పించారు. అప్పటికే త్రివిధదళాలకు చెందిన అధికారులు చేరుకుని, రాష్ట్రపతి సందర్శనకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెన్నయ్ కి ఉన్నత స్థాయి నేతలంతా చేరుకున్న నేపథ్యంలో అణువణువూ తనిఖీలు చేస్తూ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి సమీపంలో జయలలిత అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు.

More Telugu News