: జయలలిత పార్థివదేహాన్ని సందర్శించిన చంద్రబాబు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. చెన్నైలోని రాజాజీహాల్ లో ఉంచిన ఆమె పార్థివదేహానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పార్థివదేహం వద్ద చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనంలో చిక్కుకుపోయారు. చంద్రబాబు వెంట వచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆమె పార్థివదేహం వద్దకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది.

More Telugu News