: అప్పుడే కిక్కిరిసిన రాజాజీ హాల్.. 'అమ్మ'ను కడసారి చూసేందుకు పోటెత్తుతున్న అభిమానులు

సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉంచిన అనంతరం దివంగత నేత పార్థివ దేహాన్ని ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు మొత్తం అక్కడే ఉంచుతారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. దీంతో అప్పుడే ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రేపు సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

More Telugu News