: ‘అమ్మ’ మృతితో దిగ్ర్భాంతిలో ప్రముఖులు.. సంతాపం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు కేంద్రమంత్రులు, నాయకులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీనటులు తమ సంతాపం తెలిపారు. పేదల సంక్షేమానికి జయ చేసిన కృషి ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు తమిళ ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. జయ మృతితో దేశం ఓ శక్తిమంతమైన నాయకురాలిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ప్రదాత అన్నారు. జయకు నివాళులర్పించేందుకు ఈ ఉదయం చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు. ఆయన వెంట నారా లోకేశ్, మంత్రులు యనమల, గంటా, అచ్చెన్నాయుడు, కొందరు ఎంపీలు వెళ్లే అవకాశం ఉంది.

More Telugu News