: పాత ఐదొందల నోట్లతో ‘టోల్’ చెల్లించే గడువు పెంపు

ఈ నెల 15వ తేదీ వరకు పాత ఐదొందల నోట్లు ‘టోల్’ ఫీజు కింద చెల్లుబాటు అయ్యేలా గడువు పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పాత రూ.500 నోట్లను టోల్ ట్యాక్స్ గా చెల్లించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ-వ్యాలట్ ద్వారా కూడా టోల్ ఫీజ్ చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

More Telugu News