: రైలు ఢీ కొనడంతో మృత్యువాత ప‌డ్డ మూడు ఏనుగులు

పట్టాలు దాటుతున్న ఏనుగులను వేగంగా వ‌స్తోన్న ఓ రైలు ఢీకొన‌డంతో అవి అక్క‌డిక‌క్క‌డే మృత్యు వాత ప‌డ్డ దారుణ‌ ఘట‌న అసోంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయ‌ని, వాటిలో రెండు ఏనుగులు గ‌ర్భంతో ఉన్నాయ‌ని అక్క‌డి అట‌వీశాఖ‌ అధికారులు తెలిపారు. ఈ ఏనుగుల‌ను కన్యాకుమారి-దిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొట్టిన‌ట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొట్ట‌డంతో ఏనుగులు చెల్లా చెదురుగా ప‌డ్డాయ‌ని, గ‌ర్భంతో ఉన్న ఏనుగుల క‌ళేబ‌రాల‌కు పోస్టు మార్టం చేసి రెండు నెలల, నాలుగు నెలల పిండాలను తొలగించినట్లు వారు తెలిపారు.

More Telugu News