: వదంతులను నమ్మకండి: తమిళనాడు పోలీసులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో పలు వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మకూడదని తమిళనాడు పోలీసులు ప్రజలకు సూచించారు. జయలలిత ఆరోగ్యంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా రాని విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర కేబినెట్ కొనసాగిస్తోన్న సమావేశం ముగిసింది. ఆ రాష్ట్ర మంత్రులు ఆసుపత్రిలోనే ఉన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు సాయంత్రం ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆ రాష్ట్ర పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.