: చెన్నైకి బయలుదేరనున్న మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి బయలుదేరనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి తమిళనాడు అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకునే ఆయన, నేరుగా అపోలో ఆసుపత్రికి వెళ్లి, గుండెపోటుకు చికిత్స పొందుతున్న సీఎం జయలలితను పరామర్శిస్తారని, ఆపై వైద్యులను సంప్రదించి, ఆమెకు జరుగుతున్న చికిత్సను, డానికి ఆమె స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. రెండు నెలలకు పైగా జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, పరామర్శించేందుకు మోదీ స్వయంగా రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు వస్తున్నారని తెలుసుకున్న జయలలిత అభిమానుల్లో ఆందోళన మరింతగా పెరిగింది.

More Telugu News