: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి, నలుగురు సజీవ దహనం

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులోని నలుగురు ప్రయాణికులను మంటలు చుట్టుముట్టడంతో వారు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News