: గడ్కరీ కూతురి పెళ్లి.. ప్రముఖులను నాగపూర్ తరలించేందుకు 50 చార్టెడ్ విమానాలు!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూతురు కేత్కి పెళ్లి ఈ రోజు సాయంత్రం నాగపూర్ లో జరగనుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖులను నాగపూర్ కు తరలించే నిమిత్తం 50 చార్టెడ్ విమానాలను సిద్ధం చేశారట. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్నారు.

More Telugu News