: అక్రమంగా తరలిస్తున్న రూ.72 లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం

కర్ణాటకలో భారీ స్థాయిలో కొత్త కరెన్సీని తరలిస్తున్న మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా, బెంగళూరుకు సమీపంలోని బైలూరు వద్ద ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలలో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.71 లక్షల విలువైన రూ.2000 నోట్లను గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న నగదును, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నిన్న బెంగళూరు, తుమకూరు, మడికేరిల్లో వేర్వేరు చోట్ల చేపట్టిన తనిఖీల్లో రూ.74.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News